వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణిచివేతపై తిరుగుబాటు: కాళోజీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఫాసిజం నేటి పాలకుల సిద్ధాంతంగా మారిందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పాలకులంతా ప్రజలను అణిచివేస్తున్నారని ప్రజాకవి కాళోజీ అన్నారు. ఈ పరిస్థితిలో అసమ్మతి, నిరసన, ధిక్కారం ప్రజల కనీస ధర్మంకావాలని అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి ఎనిమిదో మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన కోరారు.

ఈడుస్తున్న ఈడులో వున్న తాను నడుస్తున్న ఈడులో వున్నవారికి సందేశం ఇస్తున్నానని ఆయన చెప్పారు. ఎనిమిది పదుల కాళోజీ ఈ సభల్లో ఉద్వేగంగా ఒక సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రసంగించి సభలో వున్నవారందరినీ కదలించారు. చెల్లినోడికి నేరం చెల్లుబాటు అవుతున్నదని, చట్టవిరుద్ద చర్యలపుట్టగా దేశం మారిందని ఆయన అన్నారు. కట్టుకథలతో ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య హన్మకొండలో పద్మాక్షమ్మ గుట్టల్లో ఇళ్లలో పడుకున్నవారిని తీసుకుపోయి ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చిచంపారని ఆయన ఆరోపించారు. జీవించే హక్కుకోసం పోరాడుతుంటే ఊపిరి తీస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ రావు కూడా ఈ సభలో ప్రసంగించారు. ప్రముఖ విప్లవ కవి, గాయకుడు గద్దరు సభకు అధ్యక్షత వహించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X