అండిపట్టు నుంచి జయ పోటీ
చెన్నై: అన్నాడియంకె అధినేత్రి జయలలిత తమిళనాడులోని అండిపట్టి శాసనసభా నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. అన్నాడియంకె బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రకటనపై పార్టీ తరఫున జయలలితనే సంతకం చేశారు.
టాన్సీ భూకుంభకోణాకి సంబంధించిన రెండు కేసుల్లో మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత తాను అండిపట్టు నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆమె సూచించారు కూడా. జయలలిత పోటీ చేయడానికి వీలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ శాసనసభ్యుడు తంగటమిజ్ సెల్వన్ రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications
