భారత్‌ పాక్‌ లకు చర్చలే శరణ్యంఃపావెల్‌

వాషింగ్టన్‌ః దక్షిణాసియాలో శాంతిస్థాపనకు గాను భారత్‌ పాక్‌ లు చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌ పిలుపునిచ్చారు. సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం కంటే ఉభయదేశాలు చర్చలు జరపడం తక్షణావసరం అని ఆయన అన్నారు. భారత్‌ - పాక్‌ లలో పర్యటించేందుకు వస్తున్న సమయంలో ప్రత్యేక విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పరిస్థితి మరింత చేయిదాటిపోకముందే ఉభయ దేశాలు చర్చలు జరపాలి.... ఆ తరువాత సరిహద్దుల నుంచి సేనల్ని వెనక్కు పిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌ పై భారత్‌ విధించిన దౌత్యపరమైన, రవాణా పరమైన ఆంక్షలను ఎత్తివేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పావెల్‌ అన్నారు. చర్చల ద్వారా రాజకీయ, దౌత్యపరమైన విభేదాలను తొలగించుకొనేందుకు ఉభయదేశాలు కృషి చేయాలని ఆయన కోరారు.

భారత్‌ - పాకిస్తాన్‌ లో అమెరికాకు సత్సంబంధాలున్నాయి.... అయితే కాశ్మీర్‌ సమస్యను ఆ రెండు దేశాలే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పావెల్‌ వ్యాఖ్యానించారు.పావెల్‌ బుధవారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. ఆయన అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ లో పర్యటించి ఆ తరువాత భారత దేశంలో పర్యటిస్తారు. ఆ తరువాత నేపాలో అక్కడి నుంచి జపాన్‌ లో పావెల్‌ పర్యటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+