వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ పాక్‌ లకు చర్చలే శరణ్యంఃపావెల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః దక్షిణాసియాలో శాంతిస్థాపనకు గాను భారత్‌ పాక్‌ లు చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌ పిలుపునిచ్చారు. సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం కంటే ఉభయదేశాలు చర్చలు జరపడం తక్షణావసరం అని ఆయన అన్నారు. భారత్‌ - పాక్‌ లలో పర్యటించేందుకు వస్తున్న సమయంలో ప్రత్యేక విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పరిస్థితి మరింత చేయిదాటిపోకముందే ఉభయ దేశాలు చర్చలు జరపాలి.... ఆ తరువాత సరిహద్దుల నుంచి సేనల్ని వెనక్కు పిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌ పై భారత్‌ విధించిన దౌత్యపరమైన, రవాణా పరమైన ఆంక్షలను ఎత్తివేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పావెల్‌ అన్నారు. చర్చల ద్వారా రాజకీయ, దౌత్యపరమైన విభేదాలను తొలగించుకొనేందుకు ఉభయదేశాలు కృషి చేయాలని ఆయన కోరారు.

భారత్‌ - పాకిస్తాన్‌ లో అమెరికాకు సత్సంబంధాలున్నాయి.... అయితే కాశ్మీర్‌ సమస్యను ఆ రెండు దేశాలే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పావెల్‌ వ్యాఖ్యానించారు.పావెల్‌ బుధవారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. ఆయన అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ లో పర్యటించి ఆ తరువాత భారత దేశంలో పర్యటిస్తారు. ఆ తరువాత నేపాలో అక్కడి నుంచి జపాన్‌ లో పావెల్‌ పర్యటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X