విజయం చే జారదు
హైదరాబాద్ః స్వేచ్ఛగా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగితే మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు రెండో రోజు కూడా ఆయన హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీపై ఆయన తనదైన శైలిలో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. 44 వేల కోట్ల రూపాయలు రుణంగా తెచ్చిన చంద్రబాబు ఈ డబ్బును వెచ్చించి చేసిన అభివృద్ధి గురించి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించారో చెప్పాలని ఆయన అన్నారు. పేదలు, నిరుద్యోగుల స్థితిగతుల్లో ఏ మాత్రం మార్పు లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
