వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయం చే జారదు
హైదరాబాద్ః
స్వేచ్ఛగా
ప్రజాస్వామికంగా
ఎన్నికలు
జరిగితే
మున్సిపల్
ఎన్నికల్లో
విజయం
తమదేనని
కాంగ్రెస్
నేత
వైఎస్
రాజశేఖర్రెడ్డి
స్పష్టం
చేశారు.
బుధవారం
నాడు
రెండో
రోజు
కూడా
ఆయన
హైదరాబాద్లో
మున్సిపల్
ఎన్నికల
ప్రచారం
నిర్వహించారు.
ఈ
సందర్భంగా
అధికార
తెలుగుదేశం
పార్టీపై
ఆయన
తనదైన
శైలిలో
తీవ్రస్థాయిలో
దుమ్మెత్తిపోశారు.
44
వేల
కోట్ల
రూపాయలు
రుణంగా
తెచ్చిన
చంద్రబాబు
ఈ
డబ్బును
వెచ్చించి
చేసిన
అభివృద్ధి
గురించి
వివరించాలని
ఆయన
డిమాండ్
చేశారు.
ఎన్ని
కొత్త
ఉద్యోగాలను
సృష్టించారో
చెప్పాలని
ఆయన
అన్నారు.
పేదలు,
నిరుద్యోగుల
స్థితిగతుల్లో
ఏ
మాత్రం
మార్పు
లేదని
ఆయన
విమర్శించారు.
Comments
Story first published: Wednesday, January 16, 2002, 23:53 [IST]