వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం కూలి 26 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత్‌ - పాక్‌ సరిహద్దులో మొహరించినసైన్యాన్ని ఉపసంహరించుకొనే ప్రసక్తి లేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌ పేయి తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై తగిన చర్యలు తీసుకొని పాక్‌ ఇంతకాలంగా మాటల్లో చెబుతున్న దానిని చేతల్లో చూపాలని వాజ్‌పేయి హితవు చెప్పారు. సేనలను ఉపసంహరించుకొనేందుకు ఇది సమయం కాదనివిలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాజ్‌పేయి చెప్పారు. గాంధీ వర్థంతి సందర్భంగా బుధవారం కొత్తఢిల్లీలో ఖాదీపై ఓ ఎగ్జిబిషన్‌ ను ప్రారంభించిన అనంతరం వాజ్‌పేయి విలేకరులతో మాట్లాడారు.

పాకిస్తాన్‌ తీవ్రవాదులపై చర్యలు తీసుకొనేవిషయంలో ఎంతకాలం వేచి చూస్తారంటూ విలేకరులు ప్రశ్నించగా పాక్‌ మాటలకు - చేతలకు పొంతన కుదిరే సమయం దగ్గరలోనే వున్నట్లు భావిస్తున్నట్లు వాజ్‌పేయి చెప్పారు. భారత-కాశ్మీర్‌ వివాదం విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పథకం ప్రకారం ముందుకు పోతున్నామని వాజ్‌పేయి చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X