వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల బాసటే జవాన్లకుశ్రీరామరక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశభద్రతకోసం రేయంబవళ్ళు శ్రమిస్తున్న జవాన్లకు దేశం యావత్తు బాసటగా నిలుస్తుందని ప్రధాని వాజ్‌పేయి అన్నారు. సరిహద్దులో మన జవాన్లు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని వారికి దేశప్రజలు సంపూర్ణ మద్దతు వుందని గురుగోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్‌పేయి అన్నారు.

సరిహద్దులు కంపించిపోతున్న ప్రస్తుత తరుణంలో ఏ ఒక్కరూ కూడా రాజకీయాలు, ఎన్నికల గురించి ఆలోచించడం లేదని వాజ్‌పేయి అభిప్రాయపడ్డారు. దేశాన్ని మతాన్ని రక్షించేందుకు గురుగోవింద్‌ సింగ్‌ శక్తిని, భక్తిని ఉపయోగించారని ఆయన చెప్పారు. మారణకాండను అణచివేసేందుకు శక్తిని, ప్రజలను శాంతి, ప్రేమపథంలో నడిపేందుకు భక్తిని ఆయన చక్కగా ఉపయోగించి మనకు మార్గదర్శకులయ్యారని వాజ్‌ పేయ్‌ అన్నారు.అందుకే శతాబ్దాలు గడిచినా ఆయన బోధనలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X