కాశ్మీర్కు మరిన్ని అధికారాలు: అద్వానీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇస్తామని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. జమ్మూ కాశ్మీర్కు 1953 ముందటి స్థాయిని కల్పించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ ఆయన ఈవిషయం చెప్పారు. రానున్న సంవత్సరాల్లో ఒకరకమైన కాన్ఫడరెల్ పద్ధతిలో దగ్గరవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత రాజ్యాంగ నిబంధనల్లో లేనందున పూర్తి స్థాయిస్వయం ప్రతిపత్తి కల్పించే వీలు లేదని, అధికారాల కేంద్రీకరణకు, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం తమ లక్ష్యాలు అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో భారత్, పాక్లు కాన్ఫడరల్ చట్రంలో ఏకం కావాలనేది తన ఆశ అని, ఇది అసాధ్యమయ్యేస్వప్నమేమీ కాదని ఆయన అన్నారు. బెర్లిన్ గోడను కూల్చి రెండు జర్మనీలు ఏకం కావడాన్ని, రెండు కొరియాలు ఏకం అయ్యే దిశలో ముందడుగు వేయడాన్ని, ఐరోపా దేశాలుఒకే కరన్సీతో ఒకే ఆర్థిక సమాఖ్యగా ఏర్పడడాన్ని ఆయనఅసందర్భంగా గుర్తు చేశారు. పాక్, భారత్, బంగ్లాదేశ్ల మధ్య అనేకవిషయాల్లో సారూప్యత వున్నదని, ప్రత్యేక,సార్వభౌమాధికార దేశాలుగా వుంటూనే సహకార రంగాలనువిస్తరించుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
