వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాసెంటర్‌ పై తీవ్రవాదుల దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కతాః కోల్‌ కతా లోని జవహర్‌ లాల్‌ నెహ్రూ రోడ్‌ లో వున్న యునైటెడ్‌స్టేట్స్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ కేంద్రంపై మంగళవారం తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇన్ఫర్మేషన్‌ కేంద్రంలో నిలుచొని వున్న 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 12మంది భద్రతా సిబ్బంది వున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో మోటర్‌సైకిల్‌ పై వచ్చిన ముగ్గురు అమెరికా ఇన్ఫర్మేషన్‌సెంటర్‌ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్రవాదులువిచక్షణా రహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘాతుకానికి బాధ్యులైన వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హర్కతుల్‌జిహాదీ సంస్థ ఈ ఘటనకు మేమే బాధ్యులమంటూ ప్రకటించుకుంది.
అమెరికా ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా వున్న అమెరికా కార్యాలయాలవద్ద భద్రతనుపెంచారు. ఢిల్లీలో అలర్ట్‌ ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X