వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ లో పోలింగ్‌ ప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ మేయర్‌ అభ్యర్థితో పాటు వందమంది కార్పొరేటర్‌ పదవులకు మంగళవారం ఉదయం 7
గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. స్వల్ప సంఘటనలుమినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నది. ఏపార్టీకి ఆధిపత్యం వున్న ప్రాంతాల్లో ఆ పార్టీ వారుపెద్ద ఎత్తున దొంగఓట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ముమ్మరంగావినిపిస్తున్నాయి. పాతబస్తీలోని మజ్లిస్‌ కార్యాలయాలనుంచి ఓటు వేసిన గుర్తుగా వేలిపై వేసే ఇంకును చేరిపేందుకు ఉపయోగించే రసాయనాలనుస్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఉదయం పది గంటలకు జూబ్లీహిల్స్‌ లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మేయర్‌ అభ్యర్థి పదవికి 57 మంది పోటీ చేస్తుండడంతో కొండవీటి చాంతాడంతటి బ్యాలెట్‌ పత్రాన్ని మడవటంతో పాటు పోలింగ్‌ కూడా మందకోడిగా సాగుతున్నది. మధ్యాహ్నానికి 25 - 30 శాతం మధ్య పోలింగ్‌ జరిగినట్లు సమాచారంఅందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X