వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజమండ్రి పోలింగ్ లో ఘర్షణ
రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్ కు జరుగుతున్న పోలింగ్ సందర్భంగా మంగళవారం తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం మేయర్ అభ్యర్థి చక్రవర్తి ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇరువర్గాలుఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. ఈ దాడిలో కనీసం పది మంది కార్యకర్తలు గాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, January 22, 2002, 23:53 [IST]