వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా సెంటర్‌ పై దాడిదారుణంఃబుష్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః కోల్‌ కతా లోని అమెరికన్‌ ఇన్ఫర్మేషన్‌సెంటర్‌ పై టెర్రరిస్టులు జరిపిన దాడిని అమెరికా అధ్యక్షుడు బుష్‌ ఖండించారు. ప్రపంచప్రజానీకం ప్రాణాలకు ముప్పుతెస్తున్న తీవ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేందుకు అన్ని దేశాలూ కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ వర్జీనియా పర్యటనలో వున్న బుష్‌విలేకరులతో మాట్లాడుతూ కోల్‌ కతాలో జరిగిన దాడిలో అమెరికన్లు ఎవరూ మరణించపోయినా, గాయపడకపోయినా.... ఈ దాడి లక్ష్యం అమెరికాయేనని అన్నారు.

ఈ దుర్ఘటన గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు ఆయనవివరించారు. టెర్రరిస్టులు అమెరికా మీద దాడి చేశారా లేక మరోదేశంమీద దాడి చేశారా అన్నది ప్రశ్న కాదా టెర్రరిజాన్ని ఎలా నిర్మూలించాలన్నదే మన ముందున్న ప్రధాన సవాల్‌ అని బుష్‌ అన్నారు.

కోల్‌ కతా సంఘటన జరిగిన వెంటనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కొలెన్‌ పావెల్‌ భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌, పాక్‌ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ తో ఫోన్‌ లో మాట్లాడారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అనేవిషయంపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు అమెరికా హోం శాఖ ప్రతినిధి రిచర్డ్‌ బౌచర్‌ చెప్పారు. భారత బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రజలపై పశ్చిమ బెంగాల్‌ పోలీసుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా అమెరికన్‌సెంటర్‌ కు కాపలా వుంచిన పోలీసులపై దాడి జరిగినట్లు ఓ కధనంవినిపిస్తున్నదని బౌచర్‌ చెప్రారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X