ఐఎస్‌ఐకి సంబంధం లేదుః పాక్‌

ఇస్లామాబాద్‌ః కోల్‌ కతా లోని అమెరికా సమాచార కేంద్రంపై జరిగిన దాడితో ఐఎస్‌ఐకి ఏ మాత్రం సంబంధం లేదని పాకి ప్రభుత్వం స్పష్టం చేసింది. కోల్‌ కతా లోని అమెరికా కేంద్రంపై ఓదాడి జరిపినట్లు భావిస్తున్నఫర్హాన్‌ కు కొందరు పాక్‌ ఏజెంట్లతో సంబంధం వున్నదని, ఆ ఏజెంట్లకు పాక్‌ గూఢచారి సంస్థ ఐ.ఎస్‌.ఐ.తో సంబంధాలున్నాయని భారత హోం శాఖ మంత్రి ఎల్‌.కె. అద్వానీ ఆరోపించారు. ఈ ఆరోపణలను పాక్‌ నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. పాకిస్తాన్‌ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికాకు సహకరించింది, పాక్‌ సహజంగానే తీవ్రవాద వ్యతిరేకి.... అటువంటప్పుడు కోల్‌ కతాలో జరిగిన దాడికి పాక్‌ కు ఎలా సంబంధం వుంటుందని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

ఈ దాడికి బాధ్యులుగా భావిస్తున్న హర్కత్‌ మొజాహిదీన్‌ సంస్థ కార్యాలయాన్ని ఇస్లామాబాద్‌ లో బుధవారం మూసివేశారు. హర్కత్‌ తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నప్పటికీ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని ఆ సంస్థసీనియర్‌ నాయకుడు కోల్‌ కతా దాడితో మా సంస్థకు సంబంధం లేదని చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+