వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేయర్‌ రేస్‌ లో తీగలముందంజ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు బుధవారం మధ్యాహ్నం నుంచి సుమారు ఐదు గంటల పాటువిద్యుత్‌ సరఫరా నిలిచియోయింది. విజయవాడ ధర్మల్‌ పవర్‌స్టేషన్‌ - విజ్జేశ్వరం లైన్‌ లో వేవ్‌ ట్రాప్‌ బంపర్‌ తెగిపోవడంతో రాష్ట్రంలోని అన్నివిద్యుత్‌ స్టేషన్లలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో దక్షిణాది గ్రిడ్‌ కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్‌ తో పాటు కర్నాటకలో కూడా అంధకారం అలముకుంది. ఎక్కడిరైళ్ళు అక్కడే నిలిచిపోయాయి. పరిశ్రమలలో ఉత్పత్తి స్తంభించి పోయింది. ఆస్పత్రులలో వైద్యసేవలు నిలిచిపోయాయి.

ఈస్టరన్‌ గ్రిడ్‌ కు అనుసంధానం చేసి వున్న గాజువాక-జైపూర్‌ లైన్‌ బాగానే వుండడంతోశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కరెంట్‌ పోలేదు.మిగతా జిల్లాల ప్రజలు కరెంట్‌ లేక అల్లాడి పోయారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోయిన కరెంట్‌ సాయంత్రం 5 గంటల నుంచి క్రమంగా పునరుద్ధరించడం ప్రారంభించారు. దశలవారీగా అన్ని ప్రాంతాల్లో రాత్రి7.00 గంటల కల్లావిద్యుత్‌ ను పునరుద్ధరించారు. సెప్టెంబర్‌ 11 నాడు కూడా ఈ విధంగానేవిద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన విషయం విదితమే.అప్పటి అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని ఈ సారి సత్వరంవిద్యుత్‌ సరఫరా చేయగలిగారు.

నాలుగునెలల్లో నాలుగోసారి!
గత నాలుగు నెలల్లో దక్షిణాది గ్రిడ్‌విఫలం కావడం ఇది నాలుగో సారి. కర్నాటక నిర్వాకం వల్లే తరచు దక్షిణాది గ్రిడి ఫెయిలవుతున్నదని ఆంధ్రా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కర్నాటక, ఆంధ్ర మధ్యవివాదం ఏర్పడడంతో కేంద్రంలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఓవిచారణ సంఘం ఏర్పాటు చేశారు. అయినా ఫలితం శూన్యంగా కనిపిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X