వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణు ఆరోపణలపై భారత్‌ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత్‌ తాజాగా అణుపరీక్ష నిర్వహించిందంటూ పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ చేసిన ఆరోపణను భారత్‌ ప్రభుత్వం ఖండించింది. ముషారఫ్‌ నిరాధామైన ఆరోపణలు చేస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి నిరుపమారావు వ్యాఖ్యానించారు. ఇది కేవలం చీకట్లో బాణం వేయడం తప్ప మరొకటి కాదని బుధవారం ఆమె కొత్తఢిల్లీలో జరిగినవిలేకర్ల సమావేశంలో అన్నారు.

ముషారఫ్‌ ఈ మధ్య కాలంలో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు లెక్కలేనన్ని చేశారని ఆమె అన్నారు. ముషారఫ్‌ ఆరోపణల్లో ఏ మాత్రం నిజంలేదని ఆమె చెప్పారు. భారత్‌స్వచ్ఛందంగా అణ్వాయుధాలు ఉపయోగించడంపై ఆంక్షలు విధించుకున్నదని, ఎట్టిపరిస్థితుల్లోనూ వైఖరిని మార్చుకోదని నిరుపమారావు అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X