వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కర్‌, జైష్‌ పై ముషారఫ్‌ ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

లష్కర్‌, జైష్‌ పై ముషారఫ్‌ ఆగ్రహం
ఇస్లామాబాద్‌ః జైష్‌ ఏ మహమ్మద్‌, లష్కర్‌ ఏ తోయిబా రెండూ విదేశాల్లో జిహాద్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పాకిస్తాన్‌ నేత ముషారఫ్‌ ఆరోపించారు. భారత పార్లమెంట్‌పై దాడితో ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు సంబంధం వున్నదని భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం విదితమే. అయితే భారత్‌ కోరినట్టుగా 20 మంది తీవ్రవాదులను అప్పగించేది మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వారంలో రోజుల పాటు పర్యటించి వచ్చిన ముషారఫ్‌ శనివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

లష్కర్‌, జైష్‌ వంటి గ్రూప్‌లుజిహాద్‌ ఏజంట్లుగా మారి అంతర్జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాయని ఆయనపేర్కొన్నారు. ఈ సంస్థల కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో ఏర్పడిన సంస్థలుఅఎn్గానిస్తాన్‌, చెచెన్యా వంటి దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే భారత్‌లోపాకిస్తాన్‌ ప్రొత్సాహంతో సాగుతున్న సీమాంతర ఉగ్రవాదం గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు. ఉగ్రవాదానికి,స్వాతంత్ర్య పోరాటానికి మధ్య తేడా వున్నదని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో సాగుతున్నది మాత్రంస్వాతంత్ర్య పోరాటమేనని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X