వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత జట్టులో మళ్లీ లక్ష్మణ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జింబాబ్వేతో ఈ నెల 21నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న తొలిటెస్ట్‌లో భారత జట్టులో ఆడే అవకాశం ఆంధ్రా ఆటగాడు వివిఎస్‌ లక్ష్మణ్‌కు లభించింది. భారత జట్టు ఆటగాళ్ల వివరాలను శనివారం ప్రకటించారు. లక్ష్మణ్‌, జహీర్‌ఖాన్‌, వికెట్‌ కీపర్‌ దీప్‌ దాస్‌గుప్తకు జట్టులో మళ్లీ స్థానం కల్పించారు.

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చందూబోర్డే భారత జట్టులోని 14 మంది ఆటగాళ్లపేర్లను ప్రకటించారు. భుజానికి గాయం వల్ల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌మిస్‌ అయిన రాహుల్‌ ద్రావిడ్‌ కూడా జింబాబ్వేతో ఆడే జట్టులో వున్నారు.విజయవాడలో జింబాబ్వే జట్టుకు బోర్డ్‌ ఎలెవన్‌ జట్టుకు మధ్య జరిగిన మూడు రోజుల మాచ్‌లో డబుల్‌సెంచరీతో దడదడలాడించిన యువ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌కు మాత్రం జాబితాలో చోటు లభించలేదు.హర్యానా ఆటగాడు రాత్రా కేవలంవికెట్‌ కీపర్‌గా మాత్రమే రాణిస్తారని అయితే దాస్‌గుప్తా ఓపెనర్‌గా కూడా రాణిస్తాడనే నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్టువిలేకరుల సమావేశంలో బోర్డే చెప్పారు. జట్టువివరాలు ఈ విధంగా వున్నాయి. సౌరవ్‌ గంగూలీ (కాప్టెన్‌), రాహుల్‌ ద్రవిడ్‌ వైస్‌ కాప్టెన్‌, సచిన్‌ టెండూల్కర్‌,వివిఎస్‌ లక్ష్మణ్‌, శివ్‌ సుందర్‌ దాస్‌, వీరేందర్‌సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ఖాన్‌, టినూ యోహన్నన్‌, దీప్‌ దాస్‌గుప్తా, సంజయ్‌ బంగార్‌, శరణ్‌దీప్‌సింగ్‌.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X