వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూచిపూడి అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృష్ణా జిల్లా కూచిపూడిని అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృతనిశ్ఛయంతో వున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కృష్ణా జిల్లా పర్యటించిన సందర్భంగా కూచిపూడిని మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సోమవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు ప్రస్తావించారు. హామీలు ఇవ్వడమే తప్ప కూచిపూడి అభివృద్ధికి ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదని నిలదీశారు.

కూచిపూడిలోని కళాకారులను ఆదుకొనేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా? కూచిపూడిలో ఏదైనా కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారా అని సభ్యులు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌బదులిస్తూ కూచిపూడి, కృష్ణానదిలోని భవానీ ఐలండ్స్‌ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు, అంతర్జాతీయ పర్యాట కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు 5.6 కోట్ల రూపాయలతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామన్నారు. తెలుగువిశ్వవిద్యాలయానికి అనుబంధంగా వున్న కూచిపూడిని అభివృద్ధి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X