వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూచిపూడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
హైదరాబాద్ః కృష్ణా జిల్లా కూచిపూడిని అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృతనిశ్ఛయంతో వున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కృష్ణా జిల్లా పర్యటించిన సందర్భంగా కూచిపూడిని మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సోమవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు ప్రస్తావించారు. హామీలు ఇవ్వడమే తప్ప కూచిపూడి అభివృద్ధికి ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదని నిలదీశారు.
Story first published: Monday, February 18, 2002, 23:53 [IST]