వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెరిగిన గ్యాస్, కిరోసిన్, ఎరువుల ధరలు
లక్నోః ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన సమాజ్ వాది పార్టీ అధికారం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అయితే కనీసం 200 మంది సభ్యుల మద్దతు వున్న పార్టీని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తామని గవర్నర్ విష్ణుకాంత్ శర్మ ఇంతకు ముందు ప్రకటించారు. అతిపెద్దపార్టీ అయిన సమాజా వాది పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తే మెజారిటీ సాధించి చూపిస్తామని ములాయం గవర్నర్ కు చెబుతారని భావిస్తున్నారు.
గవర్నర్ ను కలిసే లోగానే మద్దతు కూడకట్టుకొనేందుకు ములాయం రహస్య మంతనాలు ప్రారంభించారు. 25 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, వామపక్షాలు, ఇండిపెండెంట్లు, బిఎస్.పి. నేతలను కలుసుకొనేందుకు ములాయం ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Story first published: Thursday, February 28, 2002, 23:53 [IST]