వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశవ్యాప్తంగా 20 వేల మందిఅరెస్టు
న్యూఢిల్లీః
అయోధ్యలో
రామశిలాదాన్
కార్యక్రమానికి
తరలివెళ్లేందుకు
ప్రయత్నించిన
రామసేవకులను
దేశంలోని
వివిధ
ప్రాంతాల్లో
పోలీసులు
ఎక్కడికక్కడ
అరెస్టు
చేశారు.
అహ్మదాబాద్లో
మినహా
ఇతర
ప్రాంతాల్లో
ఎక్కడా
హింసాత్మక
సంఘటలు
జరిగినట్టుగా
వార్తలు
రాలేదు.
మహారాష్ట్రలోనే
సుమారు
పదివేల
మంది
అరెస్టయినట్టుగా
అధికారులు
ప్రకటించారు.
ముంబాయిలో
8000
మందిని
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
మహారాష్ట్రలోని
రెండువేల
ఆలయాల్లో
విశ్వహిందూ
పరిషత్
కార్యకర్తలు
ప్రత్యేక
పూజలు
నిర్వహించారు.
రామసేవకులను పోలీసులు మధ్యలోనే అడ్డుకునిఅరెస్టు చేశారు. ఇదిలా వుండగా అయోధ్యలో శిలాదాన్ కార్యక్రమం ముగిసిన తర్వాత వందమంది రామసేవకులు హఠాత్తుగావివాదాస్పద స్థలంలోని తాత్కాలిక రామాలయం దిశగా దూసుకుపోవడానికి ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసు బలగాలు వెంటనే లాఠీచార్జీ జరిపి వారిని చెదరగొట్టాయి.
Comments
Story first published: Friday, March 15, 2002, 23:53 [IST]