వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌర విధులపై చైతన్యం: రంగనాథమిశ్రా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రజలు తమ బాధ్యతలు నిర్వర్తించి, హక్కలు డిమాండ్‌ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంగనాథమిశ్రా అన్నారు. రాజ్యహింస, మానవ హక్కుల ఉల్లంఘనపై యువజన కాంగ్రెస్‌ నిర్వహించిన సదస్సులో ఆయన శుక్రవారం ప్రసంగించారు.

కాంగ్రెస్‌ నాయకులు, పౌర హక్కుల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రజలకు మానవ హక్కులపైసరైన అవగాహన లేకపోవడం పట్ల రంగనాథమిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కలపై, పౌరుల బాధ్యతలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు.

మహిళలపై, దళితులపై, వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతన్నాయని, నిరసనగళం ఎత్తితే ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోందని వక్తలు అన్నారు. పోలీసుల హింస వల్ల నక్సలైట్ల హింసపెరిగిందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X