వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి దేవిక కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో విధులు నిర్వహించడం కనాకష్టమైన మదనపల్లె డివిజన్‌లోని పంచాయతీరాజ్‌అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సి. రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. పనికి ఆహారం పథకం కింద తమకు పనులు కేటాయించడం లేని రాజకీయ నాయకులు ఒత్తిడి చేయడంతో, వేధించడంతో తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

నేను అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల నాయకుల వేధింపులు తట్టుకోలేను.అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని లేఖ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనతో పాటు మండల అభివృద్ధి అధికారి కూడా వేధింపులు భరించలేకపోతున్నారని, ఆయన కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని ఎఇ రామకృష్ణ ఆ లేఖలో చెప్పారు.

రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికారులకు ప్రాణ సంకటంగా మారాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక జిల్లాలో పలువురు మండల స్థాయి అధికారులుసెలవుల్లో వెళ్లారు. చాలా మంది బదిలీల కోసం జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X