వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజ్ఞంలా చదువుల పండుగ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా చదువులు పండుగ మహోద్యమంలా సాగుతున్నది. ఈ పండుగ ప్రారంభమై ఆదివారం మూడో రోజు కూడా అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు,విద్యా కార్యక్రమాలు జరిగాయి. పాఠశాలల నిర్వాహకులు,స్వచ్ఛంద సంస్థలకు కూడా రంగంలోకి దిగి బాలకార్మికులుగా మగ్గిపోతున్న వారినిఅక్షరాస్యులుగా తీర్చిదిద్దే మహోద్యమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాల్యాన్ని దోచుకొనే వారిపై భారీగా జరిమానా విధించి ఆ డబ్బుతో బాలకార్మికులకువిద్యా బుద్ధులు చెప్పించాలని చంద్రబాబు రాయదుర్గం బహిరంగసభలోకోరారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఉపాధ్యాయులు సహకరించాలనికోరారు. రాష్ట్రంలో 70 వేల స్కూళ్ళు, మూడు లక్షల మంది టీచర్లు వున్నారని,వీరంతా తలచుకుంటే రాష్ట్రం చదువులు లోగిలిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకార్మికులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు మరిన్ని బ్రిడ్జి స్కూళ్ళు ఏర్పాటు చేస్తామన ఆయన హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X