వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం సృష్టిస్తున్న శివానీ కేసు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీనియర్‌ రిపోర్టర్‌ శివానీ భట్నాగర్‌ హత్యకేసు కోత్త మలుపు తిరుగుతున్నది. శివాని హత్యలో కేంద్ర మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ హస్తం వున్నదంటూ పరారీలో వున్న సీనియర్‌ పోలీసు అధికారి ఆర్‌కె శర్మ భార్య మధుశర్మ చేసిన ఆరోపణలను బిజెపి తీవ్రంగా పరిగణిస్తున్నది.

ఈ ఆరోపణలపై మధుశర్మపై పరువు నష్టం దావా వేయాలని ప్రమోద్‌ మహాజన్‌ నిర్ణయించినట్టుగా బిజెపి ప్రకటించింది. కాగా మధుశర్మ గురువారం నాడు జరిగినవిలేకరుల సమావేశంలో తన భర్త నిర్ధోషి అని కొందరు పోలీసు అధికారులు, రాజకీయనాయకులు కుమ్మక్కైన తన భర్తను బలిపశువుగా మారుస్తున్నారని ఆమె ఆరోపించారు. మధుశర్మ ఆరోపణలను ప్రమోద్‌మహాజన్‌ తీవ్రంగా ఖండించారు. శివానీకి తనకు మధ్య సంబంధం రాజకీయనాయకునికి జర్నలిస్టుకు వున్న సంబంధం మాత్రమేనని ఆయన చెప్పారు. పోలీసులు కూడా ఈ కేసులో రాజకీయనాయకులు ప్రమేయం ఏమీ లేదని ప్రకటించారు. అయితే మధుశర్మ ఆరోపణలు రాజకీయవర్గాల్లోపెను సంచలనమే సృష్టించాయి. మహాజన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. బిజెపి దీనిని నిర్దద్వంద్వంగా తిరస్కరించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X