వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలు: పంటలు జలమయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోవిస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఉత్తర తెలంగాణలో జన జీవితంఅస్తవ్యస్తమైంది. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. వందలాది పంటపొలాలు నీటిలో మునిగిపోయాయి.

కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కాటారం, మహాముత్తారం, తదితర మండలాల్లోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. దాదాపు వంద గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వరంగల్‌ నగరంలో పలు ప్రాంతాలు జలమయ్యాయి. కడెం రిజర్వాయర్‌ నుంచి మూడుకూసెక్స్‌ల నీటిని వదిలిపెట్టారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సాకు పశ్చిమంగా మధ్యప్రదేశ్‌కువిస్తరిస్తోంది. దీని వల్ల ఉత్తర తెలంగాణాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. వచ్చే 12 గంటలలో తెలంగాణాలో భారీగా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చెదురుమొదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు.

గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం వద్ద వరద నీటి మట్టం గణనీయంగాపెరిగింది. దుమ్ముగూడెం, భద్రాచలంల వద్ద కూడా వరద మట్టంపెరిగింది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 31 అడుగులకు చేరుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X