వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ లో రాష్ట్రపతి పాలన తప్పనిసరి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ లోఅక్టోబర్‌ మూడు తర్వాత రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని ఎన్నికల కమిషన్‌ అభిప్రాయపడింది. గుజురాత్‌ లో ఇప్పుడు ఎన్నికల జరపడం సాధ్యం కాదని ఎన్నికల కమీషన్‌ వాదించింది. గుజరాత్‌ లో ఎన్నికలపై ఏర్పాటైన రాజ్యంగ ధర్మాసనం ముందు ఎన్నికల కమిషన్‌ బుధవారం తన వాదనలనువినిపించింది. రాష్ట్రపతి నివేదికను సమాధానం ఇవ్వకుండానే తిప్పి పంపాలని కమీషన్‌ తరపు లాయరు కె.కె.వేణుగోపాల్‌కోరారు. రాష్ట్రపతి ఊహాజనిత ప్రశ్నలు లేవనెత్తినందున వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వాదన.

గుజరాత్‌ లో జరిగిన అల్లర్ల అనంతరం అనేక మంది వలసలు పోయారని,అందువల్ల సమగ్ర ఓటర్ల జాబితాను తయారుచేసేందుకు సమయం పడుతుందని ఆయనవివరించారు. నవంబర్‌, డిసెంబర్లోనే ఎన్నికల నిర్వహణ సాధ్యమని ఆయన తేల్పిచెప్పారు.

అందువల్ల రాజ్యంగ సంక్షోభాన్ని నివారించేందుకు అక్కడ రాష్ట్రపతి పాలన నిర్వహించాలని ఆయనవిజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తమ తమ వాదనలను ఈ నెల 26 లోపు పూర్తి చేయాలని రాజ్యంగ ధర్మాసనం ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X