అద్వానీ, జోషీల హత్యకు అలీ కుట్ర

బెంగుళూర్‌: పోలీసుల చేతిలో హతమైన ఇమామ్‌ అలీ నేతృత్వంలోని ఆల్‌-ముజాహిదీన్‌ ఉపప్రధాని ఎల్‌.కె. అద్వానీని, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్‌ జోషిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తమిళనాడుటాప్‌ సీనియర్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

మురళీ మనోహర్‌ జోషిని ఈ ఏడాది జూలైలో అహ్మదాబాద్‌లో హత్య చేసేందుకు అలీవిఫల యత్నం చేసినట్లు కోయంబత్తూరు డిఐజిఅశితోష్‌ శుక్లా ఆదివారం విలేకరులతో అన్నారు. అద్వానీ కూడా అలీ హిట్‌ లిస్టులో ఉన్నట్లు ఆయన తెలిపారు. బాంబు తయారీలో చేయి తిరిగిన అలీకి ఎకె- 47 వంటి అత్యధునాతన మారణాయుధాల వాడకంలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ జమ్మూ కాశ్మీర్‌లో 1991లో, ఆ తర్వాత ఇంటర్‌సర్వీస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) బంగ్లాదేశ్‌లో శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

అలీ గ్యాంగ్‌ తిరువనంతపురంలో మే 10వ తేదీన తమిళనాడు పోలీసుల నుంచి తప్పించుకుందని, అయితే పోలీసులు ఈ గ్యాంగ్‌ కదలికలపై నిఘా పెడుతూ వచ్చారని ఆయన చెప్పారు. హత్యాయత్నాలువిఫలం కావడంతో తమిళనాడు దేవాలయాల్లో బాంబులుపెట్టే ప్రయత్నంలో అలీ మునిగిపోయాడని ఆయన చెప్పారు. చెన్నైలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో బాంబుపేలిన సంఘటనలో అలీ పాల్గొన్నాడని ఆయన చెప్పారు. ఈ సంఘటనలో 14 మంది మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+