పాట్నా: కిరోసిన్, వంటగ్యాస్ ధరలుమినహా మిగతా పెట్రోలియం ధరలు వచ్చే నెల నుంచి మరింతగాపెరిగే అవకాశం ఉందని పెట్రోలియం, సహజ వాయువులల మంత్రి రామ్ నాయక్ చెప్పారు.
గత ఆరు నెలల నుంచిపెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లోపెరిగినందున పెట్రోలియం కంపెనీలు వాటి ధరలనుపెంచాల్సిన అనివార్య పరిస్థితిలో పడ్డారని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు. కిరోసిన్, ఎల్పిజి సిలిండర్ ధరలుపెరగవని, ప్రభుత్వం వాటికి సబ్సిడీ కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడానికి వినియోగదారులకు ప్రభుత్వంఎక్సైజ్ డ్యూటీలో రాయితీ ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ రెండు ఉత్పత్తుల ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వంజూన్లో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో రెండు శాతంమినహాయింపు ఇచ్చింది.