వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్టాంపుల స్కాంలో సదాశివఅరెస్టు
ఒంగోలుః కాపులకు తగినరాజకీయ ప్రాతిధ్యం లేదని కాపునాడు నాయకులు అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో కాపు,బలిజ,తెలగ, ఒంటరి కులాల జనాభా 30శాతంపైగా ఉన్నారని చెప్పిన కాపు నాయకులు కాపులకు తగినసంఖ్యలో సీట్లు కేటాయించేలా అన్ని పార్టీలపై వత్తిడిచేయాలని ఒంగోలులో జరిగి కాపునాడు మహాసభలో తీర్మానించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభకు రాష్ట్రంనలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాపునాడు కార్యకర్తలుహాజరయ్యారు.
రాజకీయనాయకులు కుల సభలకు హాజరుకావడానికిఇబ్బంది పడతారని, తాను మాత్రం సంతోషిస్తాననితెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.రామచంద్రయ్య తన ప్రసంగంలో పేర్కొన్నారు. సభలోఅన్ని పార్టీలకు చెందిన కాపు నాయకులుపాల్గొన్నారు. సభకు హాజరైన వంగవీటి రంగా కుమారుడువంగవీటి రాధాకృష్ణ అలిగి మధ్యలోనే సభనుంచి వెళ్ళిపోవడంవిశేషం.
Story first published: Tuesday, February 17, 2004, 23:53 [IST]