దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
న్యూఢిల్లీ;ఇప్పట్లో ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదని సోనియాగాంధికూతురు ప్రియాంక గాంధీ స్పష్టంచేశారు. కాంగెస్ పార్టీ కోసంవిస్తృతంగా ప్రచారం చేస్తానని ఆమె తెలిపారు. అమేథి,రాయబరేలి ప్రజలకు ప్రస్తుతం నేను చేస్తున్న సేవలుసంతృప్తినిస్తున్నాయి. మహిళలు, బాలల కోసం చేపట్టినకార్యక్రమాలను కొనసాగిస్తాను అని ఆజ్తక్ టీవీకిఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక పేర్కొన్నారు.వంద లోక్సభనియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నట్లు వచ్చినవార్తలను ప్రస్తావించగా, ప్రస్తుతానికి అమేథి, రాయబరేలిల్లోప్రచారం చేస్తున్నానని, మిగతాచోట్లకు కూడా వెళ్ళాలని పార్టీకోరుకుంటే తప్పకుండా వెళ్తానని బదులిచ్చారు. అన్నాచెల్లెళ్ళురెండు అధికార కేంద్రాలుగా ఏర్పడకుండా నివారించేందుకే ఆమెఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న వాదనను తోసిపుచ్చారు. తాను,తన సోదరుడు వేర్వేరు అధికార కేంద్రాలం కాదని, జీవితాంతంఒక్కటిగానే ఉంటామని చెప్పారు. ప్రజాసేవ చేయాలన్న తపనతన తమ్ముడికి ఉందని ఆమె అన్నారు.