దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
న్యూఢిల్లీ;చివరి విడత ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేదాకా ఒపీనియన్పోల్, ఎగ్జిట్ పోల్లను నిషేధించాలని అఖిలపక్ష సమావేశంముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే వ్యక్తిగత దూషణలవిషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండుఅంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఇక్కడ అఖిలపక్షసమావేశం ఏర్పాటుచేసింది. ఎన్నికల నోటిఫికేషన్వెలువడిన తొలిరోజు నుంచే ఒపీనియన్ పోల్స్పై నిషేధం విధించాలనిసమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమయింది.ఎగ్జిట్ పోల్ ఫలితాలుమే 10వ తేదీన చివరి విడత పోలింగ్ పూర్తయ్యేదాకా బహిర్గతంచేయకుండా కట్టడి చేయాలని సూచించింది. ప్రజాభిప్రాయ సేకరణపేరుతో జరిగే ఒపీనియన్ పోల్స్ను కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయాన్నిమలచే ప్రక్రియగా అభివర్ణించింది. రాష్ట్రీయ జనతాదళ్ మరోఅడుగు ముందుకేసి, ఫలితాలను సూచించే జ్యోతిష నివేదికలనుకూడా ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా ఆపాలని డిమాండ్చేసింది. వ్యక్తిగత దూషణలకు సంబంధించి కాంగ్రెస్, బిజెపిభిన్నాభియ్రాలు వ్యక్తంచేశాయి. వ్యక్తిగత దూషణలంటే ఏమిటోస్పష్టంగా నిర్వచించాలని కాంగ్రెస్ ప్రతినిధి కపిల్ సిబల్ ఎన్నికలకమిషన్ను కోరారు. కాగా, సోనియా విజాతీయత అంశంవ్యక్తిగత దూషణ పరిధిలోకి రాదని బిజెపి ప్రతినిధి వికె మోల్హోత్రావాదించారు.