వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌అల్లర్లే కొంపముంచాయి: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

కులు: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికిగుజరాత్‌లో జరిగిన అల్లర్లే ప్రధాన కారణమని మాజీప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి శనివారం అంగీకరించారు. గతలోక్‌సభ ఎన్నికలలో బిజెపి సారధ్యంలోని ఎన్‌డిఎ అనూహ్యంగా ఓటమిపాలైన అనంతరం బిజెపి ఆత్మశోధనలో భాగంగా గుజరాత్‌లోజరిగిన అల్లర్లే తమ ఓటమికి ప్రధానకారణమనిమొట్టమొదటిసారిగా బిజెపి అగ్రనాయకుల్లో ఒకరైనవాజపేయి అంగీకరించారు.

గుజరాత్‌లో జరిగిన సంఘటనలుసిగ్గుచేటని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కారాదనిఆయన అన్నారు. తాము ఎన్నికలలో ఓడిపోవడానికి చాలా కారణాలుచాలా ఉన్నాయని, గుజరాత్‌తో సహా అన్ని విషయాలను ప్రతిపక్షాలుతమకు అనుకూలంగా మలుచుకున్నాయని వాజపేయి అన్నారు. కాగా తమ ఓటమికి గుజరాత్‌ అసలు కారణమే కాదనిబిజెపి అధ్యక్షుడు వెంకయ్యనాయుడుఅభిప్రాయపడుతున్నారు. ఒక వారం విశ్రాంతి కోసం ఇక్కడకువచ్చిన వాజపేయి విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్‌ అల్లర్లసమయంలో అక్కడ కొంత మంది ప్రజల మనోభావాలను ప్రతిపక్షాలురెచ్చగొట్టాయని అన్నారు. రాజకీయ లబ్ది కోసం వారుప్రయత్నించారని అన్నారు. అయితే వారిని తాను తప్పుపట్టడం లేదని,రాజకీయాలలో ఇవి మామూలేనని అయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X