నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
న్యూఢిల్లీ:కాంగ్రెస్, వామపక్షాల పొత్తుఅత్యంత ప్రమాదకరమైనదని,దేశ ప్రయోజనాలకు విఘాతంకలిగించేదని మాజీ ప్రధాని అటల్ బిహారీవాజ్పేయి అన్నారు. భారతీయ జనతా పార్టీ(బిజెపి) పార్లమెంటు సభ్యుల రిఫ్రెషర్కోర్సు కార్యక్రమంలో ఆయనశనివారం ప్రసంగించారు. వాజ్పేయిచేసిన ప్రసంగం వివరాలను బిజెపిపార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి వి.కె.మల్హోత్రా మీడియా ప్రతినిధులకుఅందజేశారు.
కాంగ్రెస్-వామపక్షాల నేతృత్వంలోనిసంకీర్ణం ప్రభుత్వం తమసంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, జాతీయ ప్రయోజనాలనుఘోరంగా దెబ్బ తీస్తోందని వాజ్పేయిఅన్నారు. జాతీయ ప్రయోజనాలనుకాపాడడానికి పార్లమెంటు ఉభయసభల్లో సమర్థమైననిర్మాణాత్మక ప్రతిపక్షంగావ్యవహరించాలని ఆయన పార్లమెంటుసభ్యులకు సూచించారు.
తమప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసిందని, ప్రస్తుత ప్రభుత్వంసంకుచిత సైద్ధాంతిక ప్రయోజనాల కోసంపని చేస్తోందని ఆయన అన్నారు.ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి తాముసంసిద్ధంగా వున్నామని ఆయనచెప్పారు.