గుడ్డిగుర్రం వరవరరావా మాట్లాడేది?:సత్యమూర్తి
మాదాపూర్భూములపై అసెంబ్లీలో రగడ
హైదరాబాద్: హైదరాబాద్సమీపంలోని మాదాపూర్ భూములవ్యవహారంపై సోమవారంశాసనసభలో గందరగోళంచెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులమధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.
అత్యంతవిలువైన మాదాపూర్లోని భూములనుగత తెలుగుదేశం ప్రభుత్వంనామమాత్రపు రేట్లకు కొన్ని సంస్థలకుదారాదత్తం చేసిందని కాంగ్రెస్సభ్యులు ఆరోపించారు. దీనికితెలుగుదేశం సభ్యుడుచెన్నమనేని రాజేశ్వరరావుప్రతిస్పందిస్తూ - ఈ భూముల మార్పిడులపైన్యాయవిచారణకు ఆదేశించాలనిడిమాండ్ చేశారు. అయితే ఈవ్యవహారంపై మంత్రివర్గఉపసంఘం సమీక్ష జరుపుతోందనిరెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు చెప్పారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధిపరిచే ఉద్దేశంతో భూములను ఇచ్చామని,ఇందులో ఏ విధమైన అవకతవకలులేవని, రోజూ ఏదో విషయంపై తమ మీదఆరోపణలు చేస్తూ వెళ్లే బదులు న్యాయవిచారణకు ప్రభుత్వంఆదేశించుకోవచ్చునని నారాచంద్రబాబు నాయుడు అన్నారు.