వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండర్లఖరారుపై అసెంబ్లీలో గందరగోళం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లవ్యవహారంపై శుక్రవారంశాసనసభలో తీవ్ర గందరగోళంచోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి కావాల్సినవారికి టెండర్లనుకట్టబెట్టే ప్రయత్నంజరుగుతోందంటూ తెలుగుదేశంప్రభుత్వంపై ధ్వజమెత్తింది.టెండర్లను ప్రభుత్వంఅస్మదీయులకు అప్పగిస్తోందనితెలుగుదేశం శాసనసభ్యుడుయనమల రామకృష్ణుడువిమర్శించారు. దీంతో సభాకార్యక్రమాలు చాలా సేపు స్తంభించాయి.

ముఖ్యమంత్రికికావాల్సిన వారికి టెండర్లను ఖరారుచేసేందుకు నిబంధనలను తుంగలోతొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.అర్హత సాధించిన కాంట్రాక్టర్లవివరాలు సభ ముందుంచుతామని భారీనీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య చెప్పారు. పెండింగ్‌లో ఉన్నప్రాజెక్టులను రెండేళ్లలో, మిగతాప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తిచేయడానికి ప్రీక్వాలిఫైడ్‌ టెండర్లుపిలిచామని ఆయన తెలిపారు. దీంతోతెలుగుదేశం సభ్యులు సంతృప్తిచెందలేదు. కేవలం పది మందికిటెండర్లు ఖరారు చేయడానికిప్రయత్నాలు జరుగుతున్నాయనియనమల రామకృష్ణుడుఅన్నారు.దీనికిమంత్రి లక్ష్మయ్య తీవ్రంగా స్పందిస్తూ -తెలుగుదేశం పార్టీ తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తోందని, ఇప్పుడుఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రీక్వాలిఫైడ్‌విమాత్రమేనని, టెండర్లను ఖరారుచేయడానికి మరో నోటిఫికేషన్‌ఇస్తామని చెప్పారు. అయినాతెలుగుదేశం సభ్యులువినకుండా ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసమయంలో ఆర్థిక మంత్రి కె. రోశయ్యజోక్యం చేసుకుని- ఆడిట్‌ లేకుండాతెలుగుదేశం ప్రభుత్వ హయాంలోఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలుతినేశారని, ఆ పద్ధతేదో తమకుచెప్తే ఆచరిస్తామని వ్యంగ్యంగాఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X