ఆలేరువద్దరోడ్డు ప్రమాదం:
హైదరాబాద్: నల్గొండజిల్లా ఆలేరు వద్ద శనివారం ఉదయంజరిగిన రోడ్డు ప్రమాదంలో రెండుకుటుంబాలకు చెందిన నలుగురుమహిళలు, ఒక పాపతో సహా పదకొండుమంది మరణించారు. కరీంనగర్కుచెందిన పున్నం రవీందర్ అమెరికాలోఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికివరంగల్కు చెందిన ఒక వ్యాపారికుమార్తె సౌమ్యతో ఈనెల ఏడో తేదీన పెళ్ళినిశ్చయమైంది.
ఈ ప్రమాదంలోవధూవరులిద్దరూమరణించడంతో వారి బంధువులరోదనలకు హద్దు లేకుండా పోయింది.వీరి పెళ్ళి మార్చిలో జరగవలసి ఉంది.వధూవరులు, ఇతర బంధువులువరంగల్ నుంచి హైదరాబాద్కుటాటా సుమోలో వస్తుండగా కారును లారీఢీకొంది. మృతదేహాలకు రోడ్డు పక్కనేపోస్ట్మార్టం జరిపించారు. తప్పు లారీడ్రైవర్దేనని, పరారీలో ఉన్న అతడినిత్వరలో పట్టుకుంటామని నల్గొండ ఎస్పీచెప్పారు. వరుడిని అమెరికా పంపేదుకుహైదరాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలుపలికేందుకు ఉభయ కుటుంబ సభ్యులంతావరంగల్ నుంచి వస్తుండగా ఈప్రమాదం జరిగింది.