ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట: ఐదుగురి మృతి
న్యూఢిల్లీ:న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం జరిగిన తొక్కిసలాటలోఐదుగురు మహిళలు మృతిచెందగా,మరో పది మంది గాయపడ్డారు. బీహార్కువెళ్ళాల్సిన జన సందర్శన్ ఎక్స్ప్రెస్నుఅందుకునేందుకు బీహీర్కు చెందినప్రయాణికులు ఒక్కసారిగా తోసుకోవడంతోఈ ప్రమాదం జరిగింది. మూడవ నెంబరుఫ్లాట్ఫాం వద్ద ఉన్న ఈ రైలును అందుకోవడానికివంతెన మీదుగా దిగి అక్కడకు చేరుకోవడానికిప్రయాణికులు ఒక్కసారిగా తోసుకోవడంతోముందుగా ఇద్దరు మహిళలు అదుపుతప్పిపడిపోయారు.
వెనుకనే గుంపుగావస్తున్న ప్రయాణికులు వారిని తొక్కుకుంటూవెళ్ళటంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులుకిందపడిపోయారు. సంఘటనలో 15మంది తీవ్రంగా గాయపడినట్టు పోలీసులుతెలిపారు. గాయపడిన వారిని రైల్వే ఆసుపత్రికితరలించారు. సంఘటనలో మొత్తం ఐదుగురుమహిళా ప్రయాణికులు మరణించినట్టుపోలీసులు తెలిపారు. బీహార్లో సాంప్రదాయకంగాజరిగే ఛాత్ పూజ, రంజాన్ పండుగలకు హాజరయ్యేందుకుఢిల్లీలో ఉన్న బీహారీలు పెద్దసంఖ్యలో తమస్వస్థలానికి చేరుకోవడానికి ఇక్కడకువచ్చినట్టు అధికారులు తెలిపారు.
కేంద్రరైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలోమృతిచెందిన ఒక్కొక్కరికి లక్ష రూపాయలవంతున నష్టపరిహారం ప్రకటించారు.తీవ్రంగా గాయపడిన వారికి 15 వేలు,స్వల్పంగా గాయపడిన వారికి ఐదువేలరూపాయల వంతున ఆయన పరిహారంప్రకటించారు.