స్వామిఅరెస్టుకు నిరసనగా బిజెపి ఉపవాసాలు
న్యూఢిల్లీ:పోలీసు కస్టడీలోఉన్న కంచి శంకరాచార్య జయేంద్రసరస్వతికి మద్దతుగా బిజెపి మూడురోజుల నిరసన ప్రదర్శనను శనివారంన్యూఢిల్లీలో ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు ఎల్.కె. అద్వాని శనివారం ఉపవాసదీక్షను పాటించారు.
ఆదివారం సీనియర్నేత మురళీ మనోహర్ జోషి దీక్షలోకూర్చుంటారు. మూడవ రోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిరోజంతా ఉపవాసం ఉంటారు. శంకరాచార్యనుఅరెస్టు చేసిన విధానాన్ని నిరసిస్తూ శుక్రవారంబిజెపి నేతల బృందం రాష్ట్రపతి అబ్దుల్కలాంను కలిసి నిరసన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా రాజకీయ ప్రయోజనాలను ఆశించిదేశవ్యాప్త ఉద్యమానికి బిజెపి పిలుపునిచ్చిందనిసి. పి. ఐ( ఎం) ఆరోపించింది.












Click it and Unblock the Notifications