నేనంటే టిడిపి గుండెల్లో భయం: సీతాపతి
హైదరాబాద్: తానంటే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతున్నారని నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు సీతాపతి రావు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారంనాడు కొంతమంది అధికారులతో కలిసి ప్రకాశం బరాజ్ను సందర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల విలషయంలో ఆరోపణలు చేస్తున్నవారు, ఫైళ్లు కోరుతున్నవారు మోసగాళ్లని ఆయన అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లలో వాళ్లు తనను బురదలోకి లాగారని, తాను బురదలోకి దిగక తప్పలేదని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) అనుమతి వచ్చిన తర్వాత నీటి లభ్యత గురించి ఆలోచించవచ్చునని ఆయన అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టుకూ అవసరం లేని పర్యావరణ అనుమతి పులిచింతల ప్రాజెక్టుకే ఎందుకని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications