గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలకు ట్రిబ్యునల్ బ్రేక్
హైదరాబాద్: ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( ఎపిపియస్సి) గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందినవారి ఫలితాలను నిలిపేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. మొదట మెయిన్స్కు 28వేల మంది అర్హత సాధించారు. అయితే చాలా ఏళ్లకు ఎపిపియస్సి గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతున్నందున కటాఫ్ మార్కుల తగ్గించాలని వయోపరిమితి దాటుతున్నవారు ప్రభుత్వానికి పలు మార్లు మొర పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కటాఫ్ మార్కులను 66 నుంచి 61కి తగ్గించింది. దీంతో మరో 21 వేల మంది మెయిన్స్కు అర్హత సాధించారు.
దీని వల్ల తమకు అన్యాయం జరుగుతుందని భావించిన కొంత మంది రాష్ట్ర ట్రిబ్యునల్కు వెళ్లారు. వీరి అభ్యర్థనను విన్న ట్రిబ్యునల్ కటాఫ్ మార్కులు తగ్గించడం వల్ల అర్హత సాధించివనారి మెయిన్స్ ఫలితాలు నిలిపేయాలని ఆదేశించింది. మరో రెండు రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్న స్థితిలో ఈ ఆదేశాలు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.