విరసం సభ్యులను వదిలేయండి: వివి, కళ్యాణ్, గద్దర్
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో అరెస్టు చేసిన తమ సంఘం రచయితలను వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకులు వరవరరావు, కళ్యాణ్ రావు, ప్రజా గాయకుడు గద్దర్ హోం మంత్రి కె. జానారెడ్డిని కోరారు. వారు సోమవారం జానారెడ్డిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాలపై దాడులు మానుకోవాలని కూడా వారు జానారెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు ప్రతినిధి బలరాం పేర విడుదల అయిన ప్రకటన నకిలీదని వారు హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ లేఖ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. ఒంగోలులో జరుగుతున్న వ్యవహారాలను ఆపాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా అంతటా కొనసాగుతున్నాయని, దీన్ని హోం మంత్రి దృష్టికి తెచ్చామని కళ్యాణ్ రావు అన్నారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తామని హోం మంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరుడనే పేరుతో పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసిన దుర్గాప్రసాద్ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని వరవరరావు డిమాండ్ చేశారు.