వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్ర నిర్వాకంపై అఖిలపక్షం: వైయస్
హైదరాబాద్: మహారాష్ట్ర నిర్వాకంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అంగీకరించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న తీరును వివరించడానికి తెలుగుదేశం నాయకులు గురువారంనాడు ముఖ్యమంత్రిని కలిశారు. తెలుగుదేశం నాయకుల పట్టు మేరకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
మహారాష్ట్ర గోదావరినదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగు నీరు కరువవుతుందని, తెలంగాణ మొత్తం ఎడారిగా మారతుందని తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రికి వివరించారు. మహారాష్ట్ర నిర్వాకాన్ని తాము తేలికగా తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి తెలుగుదేశం నాయకులతో చెప్పారు.
Comments
Story first published: Thursday, May 12, 2005, 23:53 [IST]