వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంయమనం పాటించండి: చంద్రబాబు విజ్ఞప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంయమనం పాటించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. పెనుకొండలో ఏం జరిగిందేనే కచ్చితమైన సమాచారం అందితే తప్ప ఆ సంఘటనపై తాను మాట్లాడలేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్కడి సంఘటనలు పార్టీ సమీక్షిస్తుందని ఆయన చెప్పారు.

ప్రభుత్వ ఆస్తులకు గానీ, ప్రైవేట్‌ ఆస్తులకు గానీ నష్టం కలిగించవద్దని ఆయన కోరారు. మొదట పెనుకొండలో సాధారణ పరిస్థితి నెలకొనాల్సింది ఉందని, ఆ తర్వాత ఏం జరిగిందనేది సమీక్షించుకోవచ్చునని ఆయన అన్నారు. ఆవేశాలకు లోను కావద్దని, తొందరపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X