వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపిఎ ఉత్సవాలకు వామపక్షాలు దూరం?
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవాలకు తాము హాజరు కాబోమని వామపక్షాలు సూచనప్రాయంగా తెలియజేశారు. యుపి ఎ ప్రభుత్వ వార్షికోత్సవాలు ఈ నెల 22వ తేదీన జరుగుతాయి. కనీస ఉమ్మడి ప్రణాళికపై కొన్ని విభేదాలు ఉన్న కారణంగా ఈ వార్షికోత్సవాలకు దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి.
" అవి వారి ఉత్సవాలు. వారు జరుపుకుంటారు. కొన్ని విభేదాల కారణంగా వాటికి మేం హాజరు కాకపోవచ్చు అని సిపియం సీనియర్ నాయకుడు జ్యోతిబసు పార్టీ రెండు రోజుల పోలిట్బ్యూరో సమావేశానంతరం విలేకరులతో అన్నారు. అయితే యుపిఎ, వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతోందని, ఆ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, May 15, 2005, 23:53 [IST]