వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిఎ ఉత్సవాలకు వామపక్షాలు దూరం?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవాలకు తాము హాజరు కాబోమని వామపక్షాలు సూచనప్రాయంగా తెలియజేశారు. యుపి ఎ ప్రభుత్వ వార్షికోత్సవాలు ఈ నెల 22వ తేదీన జరుగుతాయి. కనీస ఉమ్మడి ప్రణాళికపై కొన్ని విభేదాలు ఉన్న కారణంగా ఈ వార్షికోత్సవాలకు దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి.

" అవి వారి ఉత్సవాలు. వారు జరుపుకుంటారు. కొన్ని విభేదాల కారణంగా వాటికి మేం హాజరు కాకపోవచ్చు అని సిపియం సీనియర్‌ నాయకుడు జ్యోతిబసు పార్టీ రెండు రోజుల పోలిట్‌బ్యూరో సమావేశానంతరం విలేకరులతో అన్నారు. అయితే యుపిఎ, వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతోందని, ఆ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X