హ్యాచరీలో మంటలు: నలుగురు దుర్మరణం
నెల్లూరు: నెల్లూరు జిల్లా టి.పి. గూడూరు మండలం వెంకన్నపాలెంలోని శరత్ హ్యాచరీలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హ్యాచరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లేచాయి. గదిలో బ్లీచింగ్ పౌడర్ నిల్వ చేశారు. ఈ బ్లీచింగ్ పౌడర్కు మంటలు అంటుకోవడంతో హ్యాచరీ అంతా మంటలు లేచాయని చెబుతున్నారు. దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత హెచ్చుగా ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
