వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
థియేటర్లలో పేలుళ్ల కేసు: మిలిటెంట్ అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ నెల 22వ తేదీన జంట థియేటర్లలో జరిగిన పేలుళ్లకు సంబంధించి పోలీసులు బబ్బర్ ఖల్సాకు చెందిన మిలిటెంట్ను అరెస్టు చేశారు. బల్వీందర్ సింగ్ అనే మిలిటెంట్ను జలంధర్లో సోమవారంనాడు అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వివాదాస్పదమైన సినిమా జో బోలె సో నిహాల్ ప్రదర్శిస్తున్న లిబర్టీ, సత్యం థియేటర్లలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఒకరు మరణించగా, 50కి పైగా గాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, May 31, 2005, 23:53 [IST]