బీహార్ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: శాసనసభ రద్దును, అందుకు గవర్నర్ బూటా సింగ్ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్ యునైటెడ్ (జెడియు), లోక్జనశక్తి ( ఎల్జెపి) మాజీ శాసనసభ్యులు మంగళవారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను రద్దు చేస్తూ హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన రాష్ట్రపతి ప్రకటనను కొట్టేయాలని వారు సుప్రీంకోర్టును కోరారు. పటిషన్ దాఖలు చేసివవారిలో రామేశ్వర్ ప్రసాద్ (బిజెపి), డాక్టర్ అనిల్ కుమార్ ( ఎల్జెపి చీలిక వర్గం), రాం పర్వేష్ రాయ్ ( ఇండిపెండెంట్) ఉన్నారు. వీరందరూ రద్దయిన శాసనసభలో సభ్యులు.












Click it and Unblock the Notifications
