వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేవాదాయ శాఖలో 5గురి సస్పెన్షన్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ భూములను అక్రమంగా విక్రయించిన కేసులో 5గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు తెలిపారు. తాను ప్రజాపథంలో ఉండగా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ విషయంలో అధికారులు తనను తప్పుదారి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషనర్ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) దర్యాప్తుతో పాటు శాఖాపరమైన విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Tuesday, May 31, 2005, 23:53 [IST]