వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సాలో నక్సల్స్‌ కోసం ముమ్మరంగా గాలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: ఒరిస్సాలోని మారుమూల ప్రాంతాలకు కూడా నక్సల్స్‌ తమ కార్యకలాపాలను విస్తరింపజేసినట్టు గూఢచార నివేదికలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎనిమిది జిల్లాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సంబాల్‌పూర్‌, డియోగఢ్‌, అంగుల్‌, సుందర్‌గఢ్‌, జాజ్పూర్‌, కోయెన్జిహర్‌, ధేన్‌కనల్‌, మయూర్‌భంజ్‌లలో నక్సల్స్‌ కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేసినట్టు డిజిపి బి.బి.మిశ్రా చెప్పారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోని నక్సల్‌ పీడిత ప్రాంతాలైన రాయగడ, మల్కంగిరి, కోరాపుట్‌, గజపతి జిల్లాల్లో నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాలు చురుగ్గా అమలవుతున్నాయి. గాలింపు చర్యలు ప్రారంభమైన తరుణంలోనే ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నేతత్వంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం యాధచ్ఛికంగా జరిగిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జుంజుమారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బుర్దా గ్రామంలో మావోయిస్టులుగా అనుమానిస్తున్న కొందరు ముగ్గురు వ్యక్తులను కాల్చిచంపి, నలుగురిని గాయపరిచిన నేపథ్యంలో గాలింపు చర్యలను ఉధతం చేసినట్టు తెలుస్తోంది. జుంజుమారా ప్రాంతంలో మే 31 రాత్రి కుసముర అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టిన భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఏడు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X