ఎంతటివారైనా కష్టపడాల్సిందే: చాపెల్
హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం సరి కాదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ అన్నారు. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడం మంచిది కాదని, అది ద్విజాతి సిద్ధాంతానికి దారి తీస్తుందని ఆయన ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆయన అన్నారు.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మరో పాకిస్థాన్ ఏర్పాటుకు పునాది పడుతుందని, తమకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే వరకు ముస్లింలు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేవారు గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మరో పాకిస్థాన్లా తయారవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ఇ-పేవా కార్యక్రమాల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. వీటి పరిశీలనకు తమ రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్కు వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇ - సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడును ఆయన కలుసుకున్నారు. బాబూలాల్ గౌర్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని ఆయన చెప్పారు.