వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనంపైకి దూసుకెళ్లిన లారీ: నలుగురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఒక లారీ బస్ స్టాపులో నించున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన జిల్లాలోని నారయణవనం మండలం ఏకండ్రిక గ్రామంలో జరిగింది. లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. లారీని మలుపు తిప్పుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రించలేకపోయాడని, దీంతో అది బస్స్టాపులో నిలుచున్నవారిపైకి దూసుకెళ్లిందని పోలీసులంటున్నారు. గాయడినవారిని పుత్తూరు, చిత్తూరు ఆస్పత్రుల్లో చేర్చారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
Comments
Story first published: Wednesday, June 29, 2005, 23:53 [IST]